Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముస్తాబాద్
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలిక(6)పై ఓ బాలుడు(14) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకయ్యకుంట గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం... వెంకయ్యకుంట గ్రామానికి చెందిన రేణుక-ప్రవీణ్ దంపతులు దినసరి కూలీలుగా పని చేస్తూ జీవనం గడుపుతున్నారు. రోజు మాదిరిగానే సోమవారం పనికెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వారి కుమార్తె(6)పై పక్కనే ఉండే మేనమామ వరుసయ్యే బాలుడు(14) లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం చిన్నారికి కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆరాతీశారు. దీంతో విషయం తెలిసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.