Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఇతర ప్రజా సమస్యలపై పోరాడుదామని ఐద్యా ప్రతినిధులు పిలుపునిచ్చారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కేంద్ర కమిటీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ సుందర య్య కళానిలయంలో మూడు రోజులపాటు కొనసా గుతాయి. ఐద్వా జాతీయ నాయకులు సుభాషిణీ అలీ, జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలిని భట్టాచార్య, మరియం ధావలే, వైద్యఆరోగ్యశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ శ్రీమతి, కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ జోసఫిన్, జగ్మతి సంగ్మాన్ (హర్యానా), నీలా (కర్ణాటక), వాసుకి (తమిళనాడు), సుమిత్ర (రాజస్థాన్), అర్చన ప్రసాద్, కీర్తిసింగ్ (ఢిల్లీ)తోపాటు 20 రాష్ట్రాల్లో ప్రజా పోరాటా లకు, ఉద్యమాలకు నాయకత్వం వహించిన 80 మంది కేంద్ర కమిటీ సభ్యులు హైదరాబాద్ చేరుకు న్నారు. తొలి రోజు సమావేశాల్లో ఇటీవలే అసువులు బాసిన విజరుకాంత్ ఠాకూర్, కెకె సింగ్, సోమనాత్ ఛటర్జీ, కొండపల్లి కోటేశ్వరమ్మ, డాక్టర్ మోటూరు ఉష, రామచంద్రన్ నాయర్, అబూబఖర్ సిద్దిఖీ, రాజేష్ కుమార్, తాపస్ బర్మన్ తదితరులకు కేంద్ర కమిటీ సభ్యులు నివాళులు అర్పించారు. బుధవారం నుంచి దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు, చర్చిస్తామని ఐద్వా రాష్ట్ర ప్రతినిధులు ఎస్.పుణ్యవతి, టి.జ్యోతి, బి.హైమావతి, కెఎన్ ఆశాలత, మల్లు లక్ష్మీ తెలిపారు. ఇటీవలే ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహించిన మహిళల నిరసన ర్యాలీ, నేషనల్ హెల్త్ అసెంబ్లీ (ఎన్హెచ్ఏ)లో ఐద్వా పాత్ర తదితర అంశా లపై సమీక్ష నిర్వహిస్తామని వివరించారు. 12 ఏండ్ల తరువాత హైదరాబాద్లో జరుగుతున్న సమావేశా లను జయప్రదం చేయాలని వారు కోరారు.