Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అమరేందర్రెడ్డి రాజీనామా
- పీఏపల్లి ఎంపీపీ, దేవరకొండ వైస్ ఎంపీపీ గుడ్బై
- హత్నూర జడ్పీటీసీ రాజీనామా త్వరలో కాంగ్రెస్లో చేరిక..
నవతెలంగాణ-దేవరకొండ / హత్నూర
రాజకీయ పార్టీల్లో జంపింగ్ల పరంపర కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. మిర్యాలగూడలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అల్గుబెల్లి అమరేందర్రెడ్డి, దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి మండల ఎంపీపీ మేడారం రాజమ్మ, దేవరకొండ వైస్ ఎంపీపీ దూళిపాల వేణుధర్ రడ్డిలతో పాటు మరికొందరు టీఆర్ఎస్కు మంగళ వారం రాజీనామా చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర జడ్పీటీసీ కూడా రాజీనామా చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఆశయం మేరకు టీఆర్ఎస్కు రాజీనామా చేసి బుధవారం కాంగ్రెస్లో చేరనున్నట్టు రాష్ట్ర నాయకులు అల్గుబెల్లి అమరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని తన స్వగృహంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఉద్యమకారులకు టీఆర్ఎస్ అన్యాయం చేస్తోందన్నారు. పార్టీ విధానాలు నచ్చక టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు చెప్పారు. మెజార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు తన వెంట వస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో అధిష్టా నం ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని, మిర్యాలగూడలో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని అన్నారు. దేవరకొండలో సోమవారం డిండి మండలం ఎంపీపీ వీరకారి నాగమ్మ రాజీనా మా చేయగా మంగళవారం పీఏపల్లి ఎంపీపీ, దేవర కొండ వైస్ ఎంపీపీలతోపాటు దుగ్యాల, వద్దిపట్ల ఎంపీటీసీలు ధర్మి బోడియానాయక్, పేర్ల సైదులు, దేవరకొండ మున్సిపాలిటి 1వ వార్డు కౌన్సిలర్ పొట్ట సుగుణయ్య, ఈద్గా కమిటీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్తోపాటు మాజీ ప్రజాప్రతినిధులు కొందరు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ వేణుధర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి రవీంద్రనాయక్, ఎమ్మెల్సీ రాములునాయక్ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం వల్ల గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కొండమల్లేపల్లి మండలం కొర్రాతండాకు చెందిన గిరిజనులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని కాంగ్రెస్ను బలపరు స్తున్నట్టు తెలిపారు. తమతో పాటు డిండి ఎంపీపీ వీరగాని నాగమ్మ ఈనెల 25న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్టు తెలిపారు. వారం రోజుల అనంతరం నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.
సంగారెడ్డిలో..
తాజా మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలి, ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వకపోవడం, స్థానిక నాయకుల ఒంటెద్దు పోకడల వల్ల సంగారెడ్డి జిల్లా హత్నూర జడ్పీటీసీ పల్లె జయశ్రీ మంగళవారం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె మంగళవారం దౌల్తాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. కొందరు టీఆర్ఎస్ నాయకులే తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం అర్ధరహితమని విమర్శించారు. జడ్పీటీసీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డిగానీ, తనపై విమర్శలు చేస్తున్న నాయకులుగానీ తన గెలుపునకు కృషి చేయలేదని, నాటి ఉద్యమ ప్రభావం, యువతే గెలిపించారని అన్నారు. జడ్పీటీసీగా ఎన్నికైన తరువాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్రెడ్డి గెలుపు కోసం మండల మొత్తం తిరిగానని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన వారి పెత్తనమే కొనసాగుతోందని విమర్శించారు. ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారెడ్డిల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు జడ్పీటీసీ పి.జయశ్రీ తెలిపారు.