Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-కంఠేశ్వర్
రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాడుతున్న వామపక్ష, సామాజిక శక్తులను బలపరుద్దామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. నిజా మాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేండ్ల టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ దగాకు గురయ్యారన్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాలను అమలు చేయటంలో టీఆర్ఎస్ ప్రభు త్వం విఫలమైందన్నారు. కార్మికుల సమ్మెలో కాలంలో యూనియన్లతో చర్చించేది లేదనే అసమంజస వైఖరితో ముఖ్యమంత్రి, మంత్రులు కార్మిక సంఘాల నాయకులను దుర్భాషలాడారని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికశాఖ నిర్వీర్యమైందని, అన్ని సందర్భాల్లోనూ యజమానులకే కొమ్ముకాసిందని అన్నారు. కార్మిక, ప్రజావ్యతిరేక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ఓడిద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటేశ్, నూర్జహాన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్, శంకర్ గౌడ్, చక్రపాణి, ఏషాల గంగాధర్ పాల్గొన్నారు.