Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్యం, డబ్బు రవాణాపై నిఘాను పెంచండి
- నిబంధనలను అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించండి
- మావోయిస్టుల ద్వారా ఎన్నికలకున్న ఆటంకం రాకుండా చూడండి
- జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లు, ఐజీలకు సీఈసీ ఆదేశాలు
- ఎన్నికల బందోబస్తును పటిష్టంగా నిర్వహిస్తున్నామన్న ఐపీఎస్లు
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
అసెంబ్లీ ఎన్నికల బందోబస్తులో ఏ రాజకీయ పార్టీ పట్ల కూడా అనుకూలంగా వ్యవహరించకుండా పూర్తిగా తటస్థం గా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులను చీఫ్ ఎలక్షన్ కమి షనర్ ఒపి రావత్ ఆదేశించారు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరపడంలో ప్రతి ఒక్క పోలీసు అధికారి చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు, డీఐజీలు, ఐజీలతో రావత్ నేతృత్వంలోని అత్యున్నత ఎన్నికల పర్యవేక్షణా బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రతి ఎస్పీ, నగర కమిషనర్, రీజియన్ ఐజీ, రేంజ్ డీఐజీలతో ఎన్నికల బందోబస్తును నిర్వహిస్తున్న తీరు తెన్నులు, వాటి పరిణామాలు మొదలైన అంశాలపై సీఈసీ ముఖాముఖీగా మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల పర్వం అతి పవిత్రమైందని, దీనికి ఎలాంటి మరక అంటకుండా ప్రతి ఒక్క అధికారి త్రికరణ శుద్ధితో విధి నిర్వహణ చేయాలని ఆయన కోరారు.
ముఖ్యంగా మద్యం, డబ్బు రవాణాపై నిఘాను మరిం త పెంచాలని అన్నారు. ఇప్పటివరకు స్వాధీన పరుచుకున్న డబ్బులను పరిశీలిస్తే ఎన్నికల సమీపించే నాటికి అది మరింతగా పెరిగే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించిన ట్టు తెలిసింది. ఇందుకోసం ప్రతి రోజు వాహనాల తనికీలు, అనుమానాస్పద ప్రదేశాల్లో దాడులు, వ్యక్తుల కదలికలపై కన్నేసి ఉంచాలని ఆయన కోరారు. ఎన్నికల పక్రియకు విఘ్నాలు కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలను అతిక్రమించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఇప్పటి నుంచే తగిన ముందస్తు బందోబస్తులను ఆ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని, ఏ ఒక్క ఓటరు కూడా భయపడకుండా తమ ఓటును వినియోగించుకునేలా చూడాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఛత్త్తీస్గఢ్ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలపైనా సీఈసీ అక్కడి ఎస్పీలతో ఆరా తీశారు. భూపాలపల్లి, ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో కొంత కదలికలు ఉన్నప్పటికీ వాటిపై తాము నిఘా వేసి ఉంచామని, వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్షిం చి తగిన నివారణ చర్యలను తీసుకుం టున్నామని ఆ ప్రాంతాల ఎస్పీలు వివరించారు.
బయటి ప్రాంతాల నుంచి మద్యం, డబ్బుల అక్రమ రవాణాలపైనా తాము కన్నేసి ఉంచినట్టు ఎస్పీలు, సీపీలు వివరించడమేగాక ఇప్పటి వరకు తాము స్వాధీనం చేసుకున్న డబ్బుల వివరాలు అందచేశారు. నామినేషన్లు, ప్రచారప ర్వాలపైనా తాము ఇప్పటినుంచే ఒక వ్యూహం ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నామని కూడా అధికారులు తెలియజేశారు. అయితే ఎన్నికల విధినిర్వహణలో పూర్తిగా తటస్థంగా వ్యవహరిం చాలని సీఈసీ పలుమార్లు అధికారులకు దిశానిర్దేశం చేశారని తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, నగర కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేష్భగ వత్, కమలాసన్రెడ్డి, కార్తికేయ, సత్యనారాయణ, తప్సీల్ ఇక్భాల్, జోయెల్డేవిస్ లతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.