Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ ప్రతినిధి
''నాలుగు పార్టీల నాయకులు కారెక్కడం వల్ల ఓవర్లోడ్ అయింది. ముందోవెనుకో అందరికీ న్యా యం జరుగుతది. ముందుగాల మన పంచాయితీ లను పక్కనబెట్టాలి. కలిసికట్టుగా ముందుకుపోయి కూటమిని తరమికొట్టాలి'' అని టీఆర్ఎస్ శ్రేణులకు ఆపద్ధర్మ మంత్రి కే.తారకరామారావు పిలుపునిచ్చా రు. మహా కూటమి వాళ్లు సీట్లు పంచుకునేలోగానే మనమంతా స్వీట్లు పంచుకోవాలని ఆకాంక్షించారు. జనగామ జిల్లా స్టేషన్ఘనపూర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం విద్యాజ్యోతి డిగ్రీ కళా శాల మైదానంలో మంగళవారం జరిగింది. బస్టాండ్ నుంచి విద్యాజ్యోతి కళాశాల వరకు ర్యాలీ నిర్వహిం చారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య అధ్యక్ష తన జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... ఒక కుటుంబంలో నలుగురుంటేనే చిన్న చిన్న అభిప్రాయ భేదాభిప్రాయాలుంటాయని, ఘనచరిత్ర కలిగిన స్టేషన్ఘనపూర్లో నాయకుల మధ్య భేదాభి ప్రాయాలుండటం సహజమేనని అన్నారు. కేసీఆర్ను సీఎం చేయాలంటే రాజయ్య-శ్రీహరి గ్రూపులు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఎవరు ఎంత పనిచేశారో పోలింగ్ కేంద్రం ఆధారం గా పరిశీలిస్తామని, వారికే పంచాయతీ ఎన్నికల్లో గుర్తింపు ఇస్తామని చెప్పారు. ఢిల్లీ సీల్డ్ కవర్ కావా ల్నా? మన మట్టి మనిషి కేసీఆర్ కావాల్నా? తేల్చు కోవాలన్నారు. విద్యుత్ చార్జీల కోసం పోరాటం చేస్తే టీడీపీ పార్టీ ఆరుగురిని కాల్చి చంపిందని, జానెడు జాగ కోసం ముదిగొండలో కాంగ్రెస్ పార్టీ ఆరుగురిని పొట్టనబెట్టుకుందని విమర్శించారు. ఆపద్ధర్మ డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడాలని పిలిచిన సందర్భంలో ఆయనకు అనుకూలంగా 'రాజయ్య వద్దు..కడియం ముద్దు' అంటూ కార్యకర్తలు నినాదా లు చేశారు. దీంతో ఒకింత భావోద్వేగానికి లోనైన కడియం శ్రీహరి మాట్లాడుతూ...'స్టేషన్ఘనపూర్లో సమ్మతిలేదు..అసమ్మతి లేదు. అందరం కలిసే ఉన్నం. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మనమంతా సైనికులుగా పనిచేయాలి. రాజయ్య నాకు తమ్ముడు లాంటోడు. అప్పుడప్పుడూ నా పట్ల తప్పుగా ప్రవర్తించినా ఎప్పుడూ పట్టించుకోలేదు. నియోజక వర్గంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. రాజయ్య నుంచి ఏమైనా పొరపాట్లు జరిగినట్లయితే క్షమాపణ కోరుతున్న. రాజయ్య-కడియం మధ్య గ్రూపుల గొడవలున్నాయని ప్రచారం చేస్తూ కొందరు లబ్ది పొందాలని చూస్తున్నరు. దీన్ని తిప్పికొట్టాలి. వేరేవాళ్లకు అవకాశం ఇవ్వొద్దు. ఎప్పుడైనా స్టేషన్ ఘనపూర్లో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుం ది. శ్రీహరిని ప్రేమించే వారంతా రాజయ్యను ఆశీర్వ దించి గెలిపించాలి. కేటీఆర్ సాక్షిగా చెబుతున్నా... నియోజకవర్గంలో పార్టీకి జరిగిన నష్టాన్ని పూడు స్తాం. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజయ్యను గెలిపిస్తాం' అని అన్నారు.
లింగంపల్లి-మల్కాపూర్ రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి జి బాలమల్లు, స్టేషన్ఘనపురం నియోజకవర్గ ఇన్చార్జి మాలోతు కవిత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, మెట్టు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.