Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందీ రాష్ట్రాల్లో గుణపాఠం చెప్పిన ఓటర్లు
- రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ విజయం
- మిజోరాంలో కాంగ్రెస్ ఓటమి
మధ్యప్రదేశ్లో ఫిఫ్టీ-ఫిఫ్టీ
2019 లోక్సభ ఎన్నికలకు సెమి ఫైనల్స్గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ కోల్పోయిందని ఫలితాలే చెబుతున్నాయి. హిందీ బెల్ట్లో కీలకమైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు బీజేపీ నుంచి చేజారిపోయాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఓటర్లు కాంగ్రెస్ వైపు నిలవగా, మిజోరాంలో తిరస్కరించారు. మధ్యప్రదేశ్లో ఓటరు తీర్పు సంక్లిష్టంగా ఉంది.
న్యూఢిల్లీ: 5-0 స్కోరుతో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయటం, నోట్లరద్దు, జీఎస్టీ తీసుకురా వటం, నిరుద్యోగా న్ని అరికట్టలేక పోవటం ఫలితాల్ని నిర్దేశించా యని చెప్పవచ్చు. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకు న్న ఛత్తీస్గఢ్, మిజోరాంలు చేదు ఫలితాల్ని మిగిల్చాయి. మిజోరాం ఓటమితో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టు కుపోయింది. ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీలకు ఆమోదముద్ర లభించకపోగా, ఉన్న స్థానాలు కోల్పోయారు. దీనిని బట్టి జాతీయ స్థాయిలోని రెండు ప్రధాన పార్టీలను ప్రజలు బలంగా కోరుకోవటం లేదని చెప్పవచ్చు. మిజో రాంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 26 స్థానాలతో స్పష్టమైన గెలుపును అందుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్ కేవలం 5స్థానాలకే పరిమితమైంది.