Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యా మండలి కసరత్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో 2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించబోయే ప్రవేశ పరీక్షలు (సెట్స్) నిర్వ హణపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) కసర త్తు ప్రారంభించింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇంతకాలం ఆ ప్రక్రి యను తాత్కాలికంగా ఆపింది. తెలంగాణలో టీఆర్ఎస్ మళ్లీ అధికా రంలోకి రావడంతో సెట్స్ నిర్వహణ ప్రక్రియను ఉన్నత విద్యామండలి అధికారులు ప్రారంభించారు. ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఎంసెట్, లాటరల్ ఎంట్రీలో ప్రవేశాలకు ఈసెట్, ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలకు ఐసెట్, లా కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్, ఉపాధ్యాయ విద్య కోర్సులో ప్రవేశాలకు ఎడ్సెట్, ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్, డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు పీఈసెట్ నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. పీఈసెట్ మినహా మిగతా సెట్లన్నీ ఆన్లైన్లోనే జరు గుతాయి. ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యత మళ్లీ జేఎన్టీయూ హైదరా బాద్కే అప్పగించే అవకాశ మున్నది. మిగతా సెట్లను ఓయూ, కేయూలకు అప్పగిస్తారు. ఐసెట్, లాసెట్, ఎడ్సెట్, పీజీఈసెట్లకు కన్వీనర్లు మారే అవకాశమున్నది. ఈ సందర్భంగా బుధవారం తనను కలిసిన విలేకరులతో ఉన్నత విద్యా మండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ సెట్స్ తేదీలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జాతీయ స్థాయి లో జరిగే ప్రవేశ, పోటీ పరీక్షలు, ఏపీ, కర్ణాటక, తమిళనాడులో ప్రవేశ పరీక్ష ల తేదీలను బట్టి తెలంగా ణలో సెట్స్ తేదీలను ఖరారు చేస్తామన్నారు.