Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలు నరుక్కున్న అభిమాని
నవతెలంగాణ-వరంగల్
భూపాలపల్లి నియోజకవర్గ ంలో తన అభిమాన నాయకుడు ఓటమి పాలవ్వడంతో ఇతర పార్టీ వారు హేళనగా మాట్లాడటం భరించలేక ఓ యువకుడు బుధవారం వేలు నరుక్కున్నాడు. ఈ ఘటన జయశంకర్ జిల్లా చిట్యాల మండలం జెడల్పేటలో జరిగింది.
భూపాలపల్లి నియోజక వర్గంలో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. గండ్ర సత్యనారాయణ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి మూడో స్థానంలో నిలిచారు. అయితే గండ్ర సత్యనారాయణకు చిట్ల మల్లేష్ వీరాభిమాని. ఆ అభిమానంతో సత్యనారాయణ ఫొటో ఉన్న టీషర్టు వేసుకొని మల్లేష్ బుధవారం గ్రామంలో తిరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ వారు ఎగతాళి చేశారు. దీంతో గ్రామస్తులందరూ చూస్తుండగానే.. గండ్ర సత్యనారాయణ కోసం ప్రాణమైనా ఇస్తా అంటూ మల్లేష్ గొడ్డలితో వేలు నరుక్కున్నాడు. కుటుంబీకులు మల్లేష్ను చికిత్స కోసం సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.