Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యకర్తలు అధైర్యపడొద్దు..
- సమస్యలపై నిలదీయాలి:
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-కలెక్టరేట్
రాష్ట్రంలో ప్రజాకూటమి ఓటమికి టీఆర్ఎస్ చేసిన దుష్ప్రచారమే కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను 50 శాతానికిపైగా ప్రజలు వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారని గుర్తు చేశారు. ఓటమితో కార్యకర్తలు అధైర్యపడొద్దనీ, మంచి కాలం రానుందనీ, దానికి రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే నిదర్శనమనీ చెప్పారు. కార్యకర్తలు ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని కోరారు. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపుతామని చెప్పారు. కరీంనగర్కు మెడికల్ కళాశాల, శాతవాహన విశ్వావిద్యాలయానికి యూజీసీ గ్రాంట్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత గంగుల కమలాకర్పై ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వాగ్దానాలు అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తామనీ, అవినీతిపై ఎండగడతామనీ అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా హైకోర్టు తీర్పు మేరకు ధర్నాచౌక్ను ఉంచాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థులు, కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు, నియంతపాలనకు పోవొద్దని సూచించారు. సమావేశంలో కర్ర రాజశేఖర్, డి.శంకర్, ఎం.డి ఆరీఫ్, గడ్డం విలాస్రెడ్డి, గందె మాధవి, సరిళ్ల ప్రసాద్, గుగ్గిళ్ల జయశ్రీ, పొన్నం సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.