Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షల ఓట్ల తొలగింపు అవాస్తవం
- ఓటు ఉందా? లేదా? అన్నది ఓటరే చూసుకోవాలి
- ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
- లేనివాళ్లు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి
- ముగిసిన ఎన్నికలకోడ్: రజత్కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముందస్తు ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు అందజేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ ఐ.రజత్కుమార్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎస్కె. రుడోలాతో కలిసి గవర్నర్ను కలిసినట్టు వివరించారు. లక్షల ఓట్ల తొలగింపు అవాస్తమని, కావాలని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓటు ఉందా? లేదా? అని చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుదేనని నొక్కి చెప్పారు. హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న పొరపాట్లు మినహా ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావారణంలో జరిగిందని, ఎన్నికల ప్రక్రియలో సహకరించిన రాష్ట్ర, జిల్లా సిబ్బందికి, ఎలాంటి వివాదాలు లేకుండా ఎన్నికల వార్తల కవరేజి ఇచ్చిన మీడియా వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కొందరు చివరి వారంలో 24 గంటల పాటు కష్టపడ్డారని కొనియాడారు. కొందరు చెబుతున్నట్టుగా రాష్ట్రంలో 22 నుంచి 25 లక్షల ఓట్ల తొలగింపు జరిగినట్టయితే శాంతిభద్రతల సమస్య తలెత్తేదన్నారు. ఎన్నికలకు ముందు అన్ని పార్టీల నాయకుల తో పలు అంశాలపై చర్చించి ఓటర్ల జాబితా రూపొందించా మని చెప్పారు. పోలింగ్లో ఇబ్బందులు తలెత్తవద్దన్న ఉద్దే శంతో ప్రతి బూత్కూ కేవలం 1400 లోపు ఓట్లనే ఉండేలా చూశామన్నారు. బోగస్ ఓట్లను ఏరివేసేం దుకు 2015 జన వరి నుంచి అక్టోబర్ వరకు ప్రతి ఇంటికీ తిరిగి తమ సిబ్బం ది వివరాలు సేకరించారని, తొలగించిన ఓట్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని ఏడు రోజుల గడువు కూడా ఇచ్చామని గుర్తుచేశారు. ఆ తర్వాత కూడా మూడు సార్లు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టామని, ఈ ఎన్నికలకు ముందు కోర్టు ఆదేశాలతో కొత్తవారితో కూడా ఓటర్ల జాబితా రూపొందించామని చెప్పారు. పలుమార్లు అవకాశాలిచ్చినా ఓటు ఉందో? లేదో? చూసుకోకుండా, దరఖాస్తు చేసుకోకుండా ఇప్పుడు వచ్చి తమ ఓటు లేదని గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. ఐదేండ్ల కింద ఓటు వేసి తమ ఓటు ఉన్నదా? లేదా? అని చూసుకోకపోవడం ఎవరి తప్పిదం అని ప్రశ్నించారు. ఇప్పటినుంచైనా ప్రతి ఓటరూ తమ ఓటు ఉందా? లేదా? అన్నది ప్రతి ఏటా చూసుకోవాలని సూచించారు. ఓటు గల్లంతైనవారు, కొత్తగా ఓటు నమోదు చేయించుకోవాలనుకున్నవాళ్లు ఆన్లైన్లో, ఈసీ క్యాంపెయిన్లో, పోలింగ్ కేంద్రాల పరిధిలో నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కొన్నిచోట్ల చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఓట్లు పోయి ఉండవచ్చునని, ఆ ఓట్ల గల్లం తుపై దృష్టి సారిస్తామని చెప్పారు. గెలిచిన అభ్యర్థులతో కూడిన జాబితాను గవర్నర్కు అందజేశామన్నారు. ఎన్నికల కోడ్ బుధవారంతో ముగిసిందని ప్రకటించారు.