Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ప్రధానాధికారికి మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉప ఎన్నికల్లో ఓటిమి భయంతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. బోగస్ ఓటర్లూ అంటూ సెటిలర్స్, కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్లను తొలగిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సనత్నగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందుతున్న భయంతో సక్రమంగా ఉన్న ఓటర్లను తొలగిస్తున్నారన్నారు. సనత్నియోజకవర్గానికి ప్రత్యేక ఆబ్జర్వర్ను నియమించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశామన్నారు. మంత్రి తలసాని ఓటమి భయంతోనే రాజీనామ డ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ నరసింహన్ అధికార పార్టీకి దాసోహం అయ్యారన్నారు.తలసాని వ్యవహారంపై మరోసారి కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.