Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ దూరవిద్య ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) సంచాలకులు వెంకటేశ్వర శర్మ ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి దూరవిద్య పరీక్షలకు 24,448 మంది హాజరయ్యారనీ, 4,575 (18.71 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారనీ తెలిపారు. ఇంటర్మీడియెట్ దూరవిద్య పరీక్షలు 16,699 మంది రాయగా, 5,756 (34.47 శాతం) మంది రాశారనీ పేర్కొన్నారు.