Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కె చంద్రశేఖర్రావుకు తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) అధ్యక్షులు జి వేణుగోపాలస్వామి, ప్రధాన కార్యదర్శి ఎం రాధాకృష్ణారావు శుక్రవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు కుట్రల నుంచి తెలంగాణను కేసీఆర్ రక్షించారని పేర్కొన్నారు. కేసీఆర్ కలలు కంటున్న బంగారు తెలంగాణ నిర్మాణానికి ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు.