Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ముఖ్య అధికారి రజత్కుమార్కు బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు లో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ నిర్వహించాలని బీఎస్పీ అభ్య ర్థి మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని ఆపేయాలని కోరారు. అలా చేయపక్షంలో తనలా అన్యా యానికి గురైన అభ్యర్థులతో కలిసి కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటిం చారు. హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధి కారి రజత్కుమార్ను ఇబ్రహీంపట్నం బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగా రెడ్డి శుక్రవారం కలిశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీకౌంటిం గ్ నిర్వహించాలని కోరారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగా యని, కావాలనే తన ఓట్లను లెక్కించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి కుమారుడు సెల్ఫోన్తో కౌంటింగ్ హాల్కు వచ్చారని, కేటీఆర్ ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారి నడుచుకున్నారని ఆరోపించారు. సెల్ఫోన్తో ఉన్న వ్యక్తి లోని కి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఆ తర్వాత 18వ రౌండ్ నుంచి తన మెజార్టీ తగ్గించారని మల్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టంచేశారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల్లో బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి, తెరాస అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ పోరు కొనసాగిన విషయం తెలిసిందే.