Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి : వీహెచ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తు న్నారని, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీసీ లకు రిజర్వేషన్లు పెంచాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా 53 శాతం ఉంటే బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తా రని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లా డారు. తమిళనాడులాగా 69 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నా రని, ఆ తరహాలో రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు పెంచాలని కోరారు. బీసీలను రాజకీయంగా ఎదగని వ్వకుండా రిజర్వేషన్లు తగ్గిస్తున్నారని చెప్పా రు. బీసీలను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీ సీలు కాకుండా కేసీఆర్ అడ్డుకుంటు న్నారని ఆయన మండిపడ్డారు.