Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుడి అరెస్ట్
- 14కోట్లు స్వాధీనం :
- వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ - గచ్చిబౌలి
సన్పరివార్ ఉపాధి మేనేజ్మెంట్ ప్రయివేటు లిమిటెడ్, ఇతర కంపెనీల పేరుతో జనానికి రూ.158 కోట్లు వసూలు చేసిన నిర్వాహకున్ని శుక్రవారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.14కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను కమిషనర్ వీసీ.సజ్జనార్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన మెతుకు రవీందర్ సిద్దిపేట జిల్లా రేవల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తు న్నాడు. గతంలో స్పెక్ట్రా, బిల్డింగ్బ్లాగ్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఏజెంట్గా పని చేశాడు. ఆ తర్వాత సొం తంగా కంపెనీ పెట్టాడు. దాంతో ప్రజలను మోసం చేస్తూ అతి త్వరలో పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిం చాలని భావించాడు. అతని స్నేహితులు, బంధువుల ను డైరెక్టర్లుగా చేరుస్తూ తాను సీఈవోగా ఉంటూ సన్పరివార్ గ్రూప్స్లో ఏడు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి ద్వారా సంగారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్లో సుమారు 14 వేల మంది వద్ద రూ.158 కోట్లు వసూలు చేశా రు. ఇందుకు ఏజెంట్లను నియమించుకుని వారికి కమీషన్ ఇస్తామంటూ ఇతరులను చేర్పించాలని గత ఏప్రిల్లో వ్యాపారం ప్రారంభించాడు. రూ.లక్ష చెల్లిస్తే 24 నెలలపాటు రూ.6 వేల చొప్పున ఇచ్చి, 25 నెలల్లో తిరిగి రూ.లక్ష ఇస్తామంటూ ప్రచారం చేశారు. ఈ డబ్బులు వసూలు చేసే ఏజెంట్లకు 3 నుంచి 4శాతం కమీషన్ ఇస్తామని నియమించుకు న్నాడు. ఈ విధంగా సంపాదించిన డబ్బును తన సొంత అవసరాలతో పాటు, డైరెక్టర్లు, ఇతర సిబ్బంది వేతనాలకు వినియోగించుకున్నాడు. శ్రీచక్ర రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. అయితే, ఏజెంట్గా పనిచేసిన శామీర్పేటకు చెందిన దుర్గాదాస్కు నెల నెలా కమీషన్ రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకు న్న పోలీసులు ఆర్థిక నేర పరిశోధన విభాగానికి అప్పగించారు. విచారణ చేప ట్టిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఏడు కంపెనీల్లో పని చేసే డైరెక్టర్లనూ త్వరలో అరెస్టు చేయనున్నారు. ఎక్కువ ఆశ చూపే కంపెనీలను నమ్మొద్దని సీపీ ప్రజలకు సూచించారు. ఈ కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్లు గోపినాథ్, విజరు, హనుమంత్, ఎస్ఐలు శ్రీను, కిశోర్, ఇతర సిబ్బందికి రివార్డు అందించారు.