Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి కడియం శ్రీహరి
నవతెలంగాణ -మహబూబాబాద్
ఈవీఎంలలో అక్రమాలకు పాల్పడి గెలుపొందినట్టు తమ పార్టీపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వారి లోపాలను సరిచేసుకోకుండా ఇంకా నిందలు మోపాలని చూడడం సిగ్గుచేటన్నారు. శనివారం మహ బూబాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల తీర్పుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలనీ, ప్రజాస్వామ్యంను అపహాస్యం చేసేలా మాట్లాడకూడదనీ అన్నారు. వచ్చే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా గెలవాలో అర్థంగాక కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఏడాదిలోగా మూడు వందల పడకల ఆస్పత్రిగా మారుస్తామని అన్నారు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని చెప్పారు. వచ్చే మూడేండ్ల కాలంలో మానుకోట చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, మానని వెంకన్న ఉన్నారు.