Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసనసభ ఎన్నికల్లో కొనసాగిన జోరునే.. పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణు లకు సూచించారు. ఆ తర్వాత జరగబోయే పార్లమెం టు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయదుందుభి మోగించేలా కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత శనివారం తొలిసారిగా నిర్వహించిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు? ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను టీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మీడియాకు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించినట్టు రాజేశ్వర్ రెడ్డి చెప్పా రు. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుపై దష్టి సారించాలని, అర్హులం దరి పేర్లనూ జాబితాలో చేర్చేలా శ్రేణులు పనిచేయాలని సూచిం చారు. సోమవారం ఉదయం 11.56 గంటలకు కేటీ ఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. జనవరిలో పంచాయతీ ఎన్నికలపై దష్టి పెట్టాలని నిర్ణయిం చామన్నారు. ఫిబ్రవరిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై దష్టి పెట్టనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నిధులు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణ భవన్లో హెల్ప్లైన్ డెస్క్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు అవ సరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్క రించాలని నిర్ణయించామన్నారు. ప్రతి పార్లమెంట్ స్థానానికి ఒక ప్రధాన కార్యదర్శిని, ముగ్గురు కార్యదర్శులను ఇన్ఛార్జులుగా నియమిస్తామని.. పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకు ఇన్ఛార్జులుగా వ్యవహరి స్తారని తెలిపారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముఠా గోపాల్, సుంకే రవి శంకర్, మైనంపల్లి హన్మంత రావు, పట్నం నరేందర్రెడ్డి, బండ్ల కష్ణ మోహన్రెడ్డిలను రిలీవ్ చేశామని తెలిపారు.
గులాబీ గూటికి వైరా ఎమ్మెల్యే..
వైరా నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన రాము లు నాయక్ శనివారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చు కున్నారు. కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండు వా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ.. ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని గెలుచుకునే విధంగా కార్యకర్తలు పని చేయాలని కోరారు. వైరా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా మని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొం దేనని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితి ఆ రెండు పార్టీలకు లేదని విమ ర్శించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.