Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయలని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ ఓట్లతో గెలిచి మా నోట్లోనే మట్టి కొడుతారా? అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు కోర్టుకు సమర్పించలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగకూడదని రిజర్వేషన్లు తగ్గించిందన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేపై సర్కారు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.