Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ
- 19న ముహూర్తం..
- గవర్నర్తో భేటీ సందర్భంగా సీఎం ప్రకటన
- ఎవరెవరికి బెర్తు దక్కేనో..?
- పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
- మాజీల్లో కొందరికే ఛాన్స్
- రేసులో ఈటల, తలసాని, పద్మారావు, జగదీశ్రెడ్డి, పల్లా, గుత్తా, సండ్ర, రెడ్యా నాయక్
- మహిళా కోటాలో పద్మా దేవేందర్ లేదా రేఖా నాయక్కు చోటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సస్పెన్స్ వీడింది. ఉత్కంఠతకు తెరపడింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న రాష్ట్ర క్యాబినెట్ను విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లిన ఆయన గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ నిర్ణయాన్ని గవర్నర్కు తెలిపారు. 19న ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రుల తో ప్రమాణ స్వీకారం చేయించేందుకు నిర్ణయించినట్టు వివ రించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలం టూ ఉన్నతాధికారులను సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు ఎవరెవరికి బెర్తులు దక్కుతాయా...? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలు, సామాజిక సమీకరణా లు, పార్టీ ప్రాధాన్యతలనుబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ కూర్పు చేపట్టారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఆయన కొద్ది రోజుల నుంచి కసరత్తులు ముమ్మరం చేసినట్టు ఆయా వర్గాలు వివరించాయి. రాష్ట్ర మంత్రివర్గంలోకి మొత్తం 18 మందిని తీసుకునే వీలుంది. ఇదే సమయంలో సీఎంతోపాటు మహమూద్ అలీ కూడా ఇప్పటికే మంత్రులుగా ఉన్న నేపథ్యంలో తొలి దఫాలో మరో 8 మందికి చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఆశావహుల నుంచి ఒత్తిడి ఎక్కువైతే మరో
ఇద్దరికి బెర్తు దక్కొచ్చని తెలుస్తున్నది. మొత్తంగా తొలి దఫాలో 8 లేదా 10 మందితో మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించనున్నారని సమాచారం. మిగతా వారితో పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రమాణం చేయిస్తారని తెలిసింది. మరోవైపు మాజీ మంత్రుల్లో కొంతమందికి తొలి దఫాలో చోటు దక్క నుండగా.. మరికొంత మందికి ఈసారి ఛాన్స్ లేకపో వచ్చని తెలిసింది. మాజీ మంత్రుల్లో కేసీఆర్కు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారితోపాటు సీనియ ర్లకు సైతం మళ్లీ బెర్తు ఖాయమని సమాచారం. ఈ క్రమంలో ఈటల రాజేందర్, జోగు రామన్న, తల సాని, పద్మారావు, జగదీశ్రెడ్డి లేదా పల్లా రాజేశ్వర రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, రెడ్యా నాయక్ ముందు వర సలో ఉన్నారు. వీరుగాక ఎర్రబెల్లి దయాకరరావు, అజ్మీరా రేఖానాయక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. సామాజిక పొందికలో భాగంగా రెడ్యా నాయక్, రేఖా నాయక్ల్లో ఒకరికే ఛాన్స్ దక్కే అవకాశ ముంది. రెడ్యా నాయక్కు బెర్తు ఖాయమైతే... మహిళా కోటాలో పద్మా దేవేందర్రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశముందని సమాచారం. నల్లగొండ నుంచి ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డికి అవకాశం దక్కొ చ్చనే వాదన బలంగా వినపడుతున్నది. ప్రస్తుతం రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మెన్గా ఉన్న ఆయ నకు ఎమ్మెల్సీ పదవినిచ్చి మంత్రివర్గంలోకి తీసుకుం టారనే చర్చ ఎప్పటి నుంచో కొనసాగుతున్నది. ఇదే జరిగితే మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి పరిస్థితేమిటన్నది ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఈ ముగ్గురూ పోటీ పడే అవకాశముంది. వీరిలో కేసీఆర్ ఎవరికి పెద్ద పీట వేస్తారో చూడాలి.
సండ్రకు తొలి దఫాలోనే...
ఇప్పటికే కుదిరిన ఒప్పందం మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తొలి దఫాలోనే అవకాశం దక్కనుందని సమాచారం. ఈ మేరకు ఆయనకు సమాచారం కూడా వెళ్లినట్టు తెలిసింది. టీడీపీ నుంచి గెలిచిన సండ్ర.. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే టీఆర్ఎస్ అగ్ర నేతలతో టచ్లో ఉన్నారు. తనకు మొదటి దఫాలోనే మంత్రివర్గంలో చోటు కల్పించాలని.. అలా అయితేనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటానంటూ ఆయన కేసీఆర్కు స్పష్టం చేశారు. దీంతో సండ్రకు తొలి దఫాలో బెర్తు ఖాయం చేయక తప్పటం లేదని సమాచారం. కేసీఆర్ మంత్రివర్గంలో చేరేందుకు సండ్ర ముందుగానే లైన్ క్లియర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయన్ను నియమించినప్పటికీ... ఆ పదవిని సండ్ర చేపట్టకపోవటం గమనార్హం.
మంత్రివర్గ కూర్పుపై భిన్నస్వరాలు
మంత్రి వర్గ విస్తరణపై ఇటు అధికారపార్టీలో నూ, అటు రాజకీయ వర్గాల్లోనూ భిన్నస్వరాలు వినిపి స్తున్నాయి. ముఖ్యంగా గుత్తా సుఖేందర్రెడ్డి, రేఖానా యక్, రెడ్యానాయక్లను మంత్రి వర్గంలోకి తీసుకో వద్దంటూ ఆ జిల్లాల టీఆర్ఎస్ నేతలు కేసీఆర్కు కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో నల్లగొండ నుంచి జగదీశ్రెడ్డికి బెర్తు ఖాయమని తెలుస్తున్నది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి, ఖమ్మం జిల్లా కోటా నుంచి సండ్ర వెంకటవీరయ్యకు దాదాపు మంత్రి పదవులు దక్కనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వీరితోపాటు కేటీఆర్, హరీశ్రావులకు కూడా చివరి నిమిషంలో మంత్రివర్గంలో చోటు కల్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు.
కేటీఆర్, హరీశ్కు నో ఛాన్స్...?
పార్లమెంటు ఎన్నికల అనంతరం అప్పటి పరి స్థితులనుబట్టి కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో... మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం పక్కా వ్యూహంతో ముందుకు పోతున్నట్టు వినికిడి. ఇందులో భాగంగా మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లకు తొలి దఫా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవచ్చని సమాచారం. మరోవైపు హరీశ్ను ఎంపీగా పోటీ చేయించేందుకు కేసీఆర్ నిర్ణయించారనే వాదన కూడా వినపడుతున్నది. ఇదే జరిగితే సీఎం కుర్చీలో కూర్చోవటానికి కేటీఆర్కు మార్గం సుగమమైనట్టేనని అధికార పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.