Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరారీలో మరొకరు
- జింకలు, కుందేళ్లు, ఉడుత మాంసం స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్న నిందితుడిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు జింక లు, మూడు కుందేళ్లు, 22 ఉడుతల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు కు సంబంధించి ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ మంగళవారం మీడియాకు వివరించారు. ఫలక్నుమాకు చెందిన సయ్యద్ జమీర్ముర్గీ చౌక్లో మాంసం దుకాణం నడిపి స్తున్నాడు. పదేండ్ల నుంచి వ్యాపారం చేస్తున్నా ఆశించిన రీతిలో లాభం రావడం లేదు. ఇల్లు గడవడమే కష్టంగా మారింది.
ఈ క్రమంలో బహద్దూ ర్పురకు చెందిన మహమ్మద్ అలీని సంప్రదించాడు. ఇద్దరూ కలిసి జింకలు, కుందేళ్లు, ఉడుతల మాంసాన్ని విక్రయించడం ప్రారంభించారు. ఈ దందా రెండేండ్ల నుంచి కొనసాగిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దుకా ణంపై దాడి చేశారు. సయ్యద్ జమీర్ను అరెస్టు చేశారు. మహమ్మద్ అలీ పరారీలో ఉన్నాడు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ఫారెస్టు అధికారులకు అప్పగించారు.