Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామారెడ్డి
కామారెడ్డి మండల పరిధిలోని నర్సన్నపల్లి శివారులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట కానిస్టేబుల్ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. కార్యాలయ సిబ్బంది గమనించి అతన్ని వెంటనే కామారెడ్డి ఏరియాస్పత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డికి చెందిన సుధాకర్ ఆర్టీవో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగాడు. కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం సుధాకర్ను స్వగ్రామమైన సంగారెడ్డికి తరలించారు. కాగా, కుటుంబ కలహాల వల్లే సుధాకర్ ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉండొచ్చని కార్యాలయ అధికారులు అంటున్నారు. అన్నదమ్ముల మధ్య గొడవలతో మనోవేదనకు గురవుతున్నాడనీ, సచివా లయంలో పని చేస్తున్న సోదరుడు తనను ఉద్యోగం నుంచి తొలగిస్తా నని బెదిరిస్తు న్నాడనీ సుధాకర్ తోటివారితో చెప్పుకున్నట్టు సమాచారం. అధికారుల వేధింపులే కారణమై ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై దేవునిపల్లి ఎస్ఐ శ్రీకాంత్ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు.