Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామస్తుల ఆందోళన
- వనస్థలీపురంలో ఘటన
నవతెలంగాణ-వనస్థలిపురం
స్కూల్ వ్యాన్ ఢకొీని చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన హైదరా బాద్ వనస్థ లిపురం పోలీస్స్టేషన్ పరిధి లోని ఇంజాపూర్లో గురువారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన జి.సైదిరెడ్డి- మౌనిక దంపతులు ఇంజాపూర్లో నివసిస్తున్నారు. వీరికి కుమారుడు రోహన్రెడ్డి(2) ఉన్నాడు. గురువారం ఉదయం ఇంజాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను తీసుకెళ్లడానికి కమ్మగూడలోని లోటస్లాప్ స్కూల్ బస్సు వచ్చింది. అక్కడ బస్సును డ్రైవర్ శంకర్ వెనక్కి తీశాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న రోహన్రెడ్డిని గమనించకుండా వెళ్లడంతో బస్సు చక్రాల కింద పడి చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. అది చూసుకోకుండా బస్సును ఆపకుండా వెళ్లడంతో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చిన్నారి మృతదేహంతో స్కూల్ వద్ద ఆందోళన నిర్వహించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.