Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుపతి: తిరుపతి లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ గౌతమ్ గుండెపోటుతో మరణించారు. సోమవారం నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలిం చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. తిరుపతి మాజీ ఎంపీి వెంకటస్వామి కుమారుడైన గౌతమ్ హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. తిరుపతి లోక్సభ నుంచి బీఎస్పీ తరపున సీటు దక్కడంతో ఆయన మరో 6 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా వీఆర్ తీసుకున్నారు. ఆఖరి నిమిషంలో ఇలా జరగడంతో కుటుంబసభ్యులు, ఆయన అనుచరులు కన్నీమున్నీరవుతున్నారు.