Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 వేల మందికి పైగా అసాంఘిక శక్తుల బైండోవర్
- 192 కేసులు నమోదు : శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిపిన సోదాలు, దాడులలో 5 కోట్ల 36 లక్షల 82వేల రూపాయల నగదు సీజ్ చేశామని రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ, పోలీసు ఎన్నికల సెల్ ఇన్చార్జి జితేందర్ శనివారం వెల్లడించారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు సవ్యంగా జరపడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందు కోసం ప్రత్యేక టీమ్లను రంగంలోకి దింపామని అన్నారు. అలాగే ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల కూడా గట్టి నిఘా వేసి ఉంచామన్నారు. ఇందులో భాగంగా 18,026 మంది రౌడీలు, గూండాలు మొదలైన వారిని పిలిచి బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే హిస్టరీషీట్లు, పీడీ చట్టం కింద నమోదైన వారి కదలికలపైనా నిఘా వేసి ఉంచి నట్టు జితేందర్ వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతా లలో కుల పరంగా ఘర్షణలకు దిగిన వారిపైనా కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎస్సీ, ఎస్టీతో పాటు ఇతర ఐపీసీకి సంబంధించి 192 కేసులను నమోదు చేశామన్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 8,411 లైసెన్సు గల ఆయుధాలను స్థానిక పోలీసు స్టేషన్ లలో డిపాజిట్ చేయించామని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న 32 మంది ఆయుధ లైసె న్సులను రద్దు చేయించామని చెప్పారు. అలాగే పెండింగ్లో ఉన్న 2,685 నాన్ బెయిలబుల్ వారెంట్లను కూడా జారీచే శామని, దానికి సంబంధించిన నిందితులను కోర్టులలో హాజరుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విచ్చలవిడిగా మద్యం సరఫరా, రవాణాదారులపై కూడా కన్నేసి ఉంచామన్నారు. వివిధ ప్రాంతాలలో నిర్వహించిన సోదాల కారణంగా 13,867 లీటర్ల మద్యం సీజ్ చేశామని, దాని విలువ 44 లక్షల 38 వేల రూపాయలని తెలిపారు. అలాగే మాదక పదార్థాల పైనా తమ ప్రత్యేక టీమ్లు నిఘా వేసి ఉంచాయన్నారు. 2 కోట్ల 57 లక్షల రూపాయల విలు వగల డ్రగ్స్, ఇతర వస్తువులను సీజ్ చేశామన్నారు. అలాగే 194 నాకా బంది ఆపరేషన్లు నిర్వహించామని, దీనితో అక్రమాయుధాలు, మద్యం వంటివి సీజ్ చేయడానికి వీలవుతున్నదని జితేందర్ వివరించారు.