Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో 2,3రోజుల పాటు ఈదురు గాలులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మే నెల రాకముందే ఎండలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల దాకా చేరగా... మరోవైపు సాయంత్రం, రాత్రి వేళ్లలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తా కర్నాటక వరకు, తూర్పు విదర్భ, తెలంగాణ, ఇంటీరియల్ కర్నాటక మీదుగా 1.5కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి నెలకొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం పొడిగాలులు వీస్తుండగా...ఇదే క్రమంలో సాయంత్రం, రాత్రి పూట భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. శని, ఆదివారాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశమున్నదని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వాన, వండగండ్ల వాన పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున ా్నరు. గురువారం ఉద యమంతా హైదరాబాద్లో తీవ్ర ఎండ కొట్టగా... అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడే నేపథ్యంలో రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఉష్ణోగ్రతలూ పెరిగే అవకాశం
ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఎండలు దంచికొడుతున ా్నయి. గాలిలో తేమ శాతం పడిపోతున్నది. దీంతో పగటిపూట విపరీతమైన ఉక్కపోత ఉంటున్నది. రాబోయే రెండు, మూడు రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సగటు కంటే మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మే తొలి వారం కల్లా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఉదయం పూట బయటకు వెళ్లేవాళ్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.