Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకేరోజు హనుమాన్ జయంతి, గుడ్ఫ్రైడే
నవతెలంగాణ-సిటీబ్యూరో
హనుమాన్ జయంతి, గుడ్ఫ్రైడే, ముస్లింల నమాజ్ ఉత్సవాలు శుక్రవారం ఒకేరోజు రావడంతో నగరంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ముఖ్యంగా పాతబస్తీలో భద్రతను భారీగా పెంచారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టిసారించి ఎలాంటి సంఘటనలూ చోటుచేసుకోకుండా పర్యవేక్షించారు. జంట నగరాల్లో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 20 వేల సిబ్బంది, 20 ప్లాటూన్లను రంగంలోకి దించిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన హనుమాన్ శోభయాత్రను కమిషనర్ అంజనీకుమార్ పరిశీలించారు.