Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దారి మళ్లించడం అన్యాయం తెలంగాణ గిరిజన సంఘం
- సబ్ప్లాన్ నిధులను తిరిగి వారికే ఖర్చు చేయాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమం కోసం కేటాయించిన ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం అన్యాయమని తెలంగాణ గిరిజన సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మైనింగ్ విస్తరణ కోసం ఖర్చు చేసిన నిధులను తిరిగి గిరిజనుల సంక్షేమానికే ఖర్చు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ధర్మానాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనాభివృద్ధికి వివిధ సంస్థలు కేటాయించిన నిధులను దారి మళ్లిస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 ఏండ్లుగా ఈతంతు కొనసాగుతున్నదని, సంబంధిత అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
బొగ్గు, ఇతర ఖనిజాలా వెలికితీత కోసం సబ్ప్లాన్ నిధులను ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. బొగ్గు గనుల నుంచి 8.2 శాతం, ఇతర గనుల నుంచి 4 శాతం నిధులను గిరిజనాభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంది. కానీ గిరిజన నిధులనే వాడుకుంటూ మొత్తానికే మోసం చేస్తున్నారని విమర్శించారు. 2017,-18లో బొగ్గు గనుల శాఖ రూ. 205 కోట్లు విడుదల చేసి అందులో బొగ్గు గనులను గుర్తించడం కోసం రూ.41.59 కోట్లు, డ్రిల్లింగ్ల కోసం రూ.82.32 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. వాటితో పాటే జౌళిశాఖకు 12 శాతం నిధులను, నేషనల్ హ్యాడ్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ.30 కోట్లు బదిలీ చేయడం అన్యాయని విమర్శించారు.