Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా
నవతెలంగాణ-మెదక్ అర్బన్
జూన్ నెలాఖరుకు మెదక్కు రైలు కూత వినిపిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు. మెదక్ పట్టణంలో శనివారం రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెదక్-అక్కన్నపేట రైల్వేలెన్ 17 కిలోమీటర్లు మంజూరైందని, ఇప్పటి వరకు తొమ్మిది కిలోమీటర్లు పూర్తి చేశామని చెప్పారు. మిగతా పనులు వేగంగా సాగుతున్నట్టు తెలిపారు. త్వరలోనే రైల్వేలైన్ పనులు పూర్తవుతాయన్నారు. కొన్ని చోట్ల భూనిర్వాసితులతో సమస్య ఉందని, త్వరలోనే దాన్నీ పరిష్కరించి పనులు పూర్తి చేస్తామన్నారు. రైల్వే స్టేషన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని, రైల్వేలైన్ నిర్మాణం మధ్యలో వచ్చే బ్రిడ్జి పనులను వేగవంతం చేశామని తెలిపారు. అంతకు ముందు ఆయన మనోహరాబాద్లో మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే పనులనూ పర్యవేక్షించారు.
మనోహరాబాద్- కొత్తపల్లి వరకు 152 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులను సెప్టెంబర్ వరకు పూర్తి చేస్తామని చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ రైల్వే మేనేజర్ అరుణ్కుమార్ జాయిన్, రైల్వే చీఫ్ ఇంజినీర్లు రమేష్కుమార్రెడ్డి, మోతీలాల్, నాగభూషణం, మున్సిపల్ వైస్చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ ఆర్కే శ్రీను ఉన్నారు.