Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉరేసుకుని తానూ ఆత్మహత్య
- కొడుకు మృతి, భార్య పరిస్థితి విషమం
నవతెలంగాణ- పటాన్చెరు
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెతో పాటు కుమారుడిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు మృతిచెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉండా. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ శివారులోని నాగార్జున కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వసంతవాడకు చెందిన రుద్రరాజు సుబ్బరాజు(47) పటాన్చెరు పారిశ్రామికవాడలోని ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2005లో మొదటి పెండ్లయింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అతన్ని హత్య చేయించాడు. అనంతరం ఆమెకు విడాకులిచ్చాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వకు చెందిన వెంకట నాగజ్యోతి లక్ష్మి(42)ని రెండు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. లక్ష్మికి గతంలోనే వివాహమైంది. కాగా, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వారిద్దరికీ పుట్టిన చైతన్య(9) ప్రస్తుతం నాగజ్యోతి-సుబ్బరాజు వద్దే ఉంటున్నాడు. అనుమానమనే రోగంతో మొదటి భార్యకు విడాకులిచ్చిన సుబ్బరాజు లక్ష్మి విషయంలోనూ అలాగే ప్రవర్తించాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భార్య, కుమారుడు నిద్రిస్తున్న సమయంలో వారిపై కొబ్బరిబోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. అనంతరం తానూ ఉరేసుకున్నాడు. ఈ ఘటనలో చైతన్య మృతి చెందాడు. దాడిలో రక్తస్రావమై స్పృహ కోల్పోయిన లక్ష్మి శనివారం ఉదయం మెల కువ రాగానే మెల్లగా బయటకొచ్చి చుట్టుపక్కల వారికి జరిగిన విషయాన్ని తెలిపింది. స్థానికులు సర్పంచ్ మధుకు ఫోన్ చేశారు. అతడు పోలీసులకు సమా ారమందించాడు. లక్ష్మిని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం నల్లగొండలోని సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. పటాన్చెరు, అమీన్పూర్ సీఐలు నరేష్, ప్రభాకర్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.