Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోలా యాడ్స్ నుంచి సెలబ్రెటీలు వైదొలగాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆధునిక జీవనశైలిలో ప్రకృతిసిద్ధ సహజ పానీయాల వినియోగం కన్నా శీతల పానీయాలు తాగడం (కూల్డ్రింక్స్) కన్నా సహజ పానియాలు తాగటమే మేలని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు సూచించారు. కోలా ప్రకటనల నుంచి సినీనటులు మమేశ్బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సెలబ్రెటీలు వైదొలగాలని కోరారు. ఈ మేరకు శనివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో జేవీవీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అందె సత్యం, ఆర్ వరప్రసాద్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ దాసరి ప్రసాద్రావు, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు వెంకట్, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు శ్రీకాంత్రెడ్డి, ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ ప్రతినిధి డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహజ పానీయాల వినియోగం కన్నా శీతలపానీయాల వినియోగం పెరగడం ఒక ముఖ్య భాగంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా విద్యార్థులు, యువత ఈ కూల్డ్రింక్స్ విపరీతంగా అలవాటుపడుతున్నారని చెప్పారు. కాని వీటిలో ఎలాంటి పోషక విలువలు లేవని తెలిపారు. వీటిని తాగడం వల్ల ప్రజల దాహర్తి తీరకపోగా వారు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. వాటిలో కార్బన్డైయాక్సైడ్, ఫాస్పరిక్ ఆమ్లం, అస్పర్టేమ్, పొటాషియం, బెంజోమెంట్ లాంటి అనేక రసయానాలను మోతాదుకు మించి వాడుతున్నందువల్ల మధుమేహం, స్థూలకాయం లాంటి జబ్బులకు గురవుతున్నారని తెలిపారు. ప్రతి లీటరు కూల్డ్రింక్స్లో 0.0150 మిళ్లీ గ్రాముల క్రిమిసంహారక మందులు ఉన్నాయని సీఎస్ఈ నివేదికలో తన నివేదికలో పేర్కొందని వివరించారు. కానీ ప్రమాణాల ప్రకారం ఈ కూల్డ్రింక్స్లలో 0.0005 మిల్లీ గ్రాముల మాత్రమే ఉండాలన్నారు. ప్రపంచం మొత్తంలో ఏడాదికి రెండుకోట్ల టన్నుల రసాయనాలను శీతలపానియాల రూపంలో వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.