Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో జూన్ నాలుగు నుంచి 12వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజరుకుమార్ శుక్రవారం మార్గద ర్శకాలు విడుదల చేశారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అన్ని ఆవాసాల్లో గల బడిఈడు పిల్లలందర్నీ గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయు లు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం, నాణ్య మైన విద్యను అందించడమే బడిబాట లక్ష్యమని పేర్కొ న్నారు. సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తెలిపారు.సమీపంలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాల్లోని ఐదేండ్ల వయస్సు పూర్తి చేసుకున్న పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశా లల్లో చేర్పించాలని సూచించారు. గ్రామ విద్యా రిజిస్టర్ను అప్డేట్ చేయాలని తెలిపారు. ఐదో తరగతి పూర్తి చేసుకున్న పిల్లల్ని ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలల్లో, 7,8 తరగతులు పూర్తి చేసుకున్న వారిని ఉన్నత పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. వందశాతం పిల్లలుపై తరగతులకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రుల భాగ స్వామ్యంతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. బాలికా విద్య ప్రాధా న్యతను తెలిపి వారిని పాఠశాలల్లో చేరేలా ప్రణాళిక రూపొం దిస్తామని సూచించారు. వచ్చేనెల 1 నుంచి 3వ తేదీ వరకు సంసిద్ధత కార్యక్రమాలు చేపట్టాల ని విజరుకుమార్ తెలిపా రు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని శాఖల అధికారులతో బడిబాట సమన్వయ సమావేశం నిర్వహించాలని సూచించారు.