Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఈవీఎం, వీవీప్యాట్లలో తేడా వస్తే వీవీప్యాట్ల స్లిప్పులనే ఫైనల్ చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి ఐరజత్కుమార్ స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజ కవర్గానికి ఐదు వీవీప్యాట్లను లెక్కిస్తామని చెప్పారు. ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయ న ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 119 శాసన సభ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు 18 జిల్లాల్లోని 35 ప్రాంగణా లలో ఉన్న 82 హాళ్లలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవు తుందని చెప్పారు.