Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23మందికి తీవ్ర గాయాలు , ముగ్గురి పరిస్థితి విషమం
- మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ సమీపంలో ఘటన
పరారీలో బస్ డ్రైవర్
నవతెలంగాణ - మంచిర్యాల
కల్వర్టును బస్సు ఢకొీట్టడంతో 23మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కండక్టర్ సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జైపూర్ వపర్ ప్లాంట్ సమీపంలో జాతీయ రహదారి 63పై శుక్రవారం జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల డిపోకు చెందిన హైర్ విత్ బస్సు 70 మంది ప్రయాణికులతో చెన్నూర్ వెళ్తోంది. బస్సును 60 స్పీడ్లో నడుపుతున్న డ్రైవర్ జేపీ సాగర్ను పక్కనే ఉన్న ప్రయాణికురాలు తిరుమల స్పీడ్ తగ్గించాలని సూచించింది. అయినప్పటికీ డ్రైవర్ ఆమె మాటలు వినకుండా అదే స్పీడ్తో నడిపాడు. జైపూర్ పవర్ ఫ్లాంట్ సమీపంలో ఎడమవైపు నుంచి వెళ్లాల్సిన బస్సు కుడివైపుకు వెళ్లి కల్వర్టును ఢకొీట్టింది. దీంతో ఒకవైపునకు ఒరిగింది. ఈ ఘటనలో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కండక్టర్ ఆశన్నతోపాటు మరో ఇద్దరు ప్రయాణికులు మహేష్, శేషుగట్టు పరిస్థితి విషమంగా ఉంది. మహేష్, శేషుగట్టును మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. డీవీఎం కే.శ్రీనివాస్, డీఎం మల్లికార్జున్రెడ్డి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఈ సందర్భంగా ప్రయాణికులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ సాగర్ పరారయ్యాడు. బస్సు ప్రమాద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమాన్ హామీ ఇచ్చారు.