Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలీలు.. ఇంజినీర్లవ్వాలి :గురుకుల రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్కుమార్
నవతెలంగాణ-గండిపేట్
పేదలను బానిసలుగా చేసిన సమాజాన్ని విజ్ఞాన వెలుగుతో కడిగేయాలని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఐపీఎస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగి గురుకుల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన 'బోలో ఇంగ్లీష్ ధనాధన్' కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్తో యుద్ధం చేయాలని సూచించారు. ఇంగ్లీష్ భాషను సులభంగా నేర్చుకుని తమ పిల్లలను జ్ఞాన వంతులను చేయాలని తల్లిదండ్రులను కోరారు. అభివృద్ధి కోసం బ్రిటీష్ వాళ్లు ఇంగ్లీష్ నేర్చుకున్నారని గుర్తు చేశారు. తాము కూడా ఉన్నత పదవులు, ఇంజినీర్లు, లాయర్లు, ఐపీఎస్లుగా మారాలంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నారు. దళితులందరూ ఉన్నత స్థాయికి చేరుకుని అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లోకి వెళ్లాలన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ కృపవరం, ఆర్సీఓ శారద ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి వినయకళాకొరివి, విద్యార్థి డాక్టర్ శ్రీకాంత్, ఆర్సీఓ శారాద, అసిస్టెంట్ అధికారి డాక్టర్ స్వాములు, గీతా చల్లా, సునీల్, నరేష్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.