Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖ
నవతెంలగాణ బ్యూరో-హైదరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మల రామారం మండలం హజీపూర్ గ్రామంలో గత నెల రోజుల క్రితం జరిగిన బాలికలపై అత్యాచారం, హత్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సంఘటనకు బాధ్యులైన నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు. హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి, పల్లవి, మనిషా అనే ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి హత్య చేసిన శ్రీనివాస్రెడ్డితో పాటు అతని కటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాలికల తల్లిదండ్రులు నిరహారదీక్ష చేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, ఈ సంఘటనపైన స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఈ ఘటనపై కొన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నామని వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.