Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 25 నుంచి నామినేషన్లు.. జూన్ 13న పోలింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం ఎన్నికల నగారా మోగింది. బల్దియా పాలకవర్గంలోని మేయర్ అధ్యక్షతన 15 మంది సభ్యులతో కీలకంగా వ్యవహరించనున్న స్థాయీ సంఘం ఎన్నికల నోటిఫికేషన్ శనివారం విడుదల చేశారు. ఈ ఎన్నికలు ప్రతి ఏడాదికోసారి నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ పాలకవర్గం ఏర్పడిన నాలుగో సంవత్సరానికి స్థాయీ సంఘం సభ్యులను ఎన్నుకోనున్నారు. జీహెచ్ఎంసీ పాలకవర్గంలో టీఆర్ఎస్కు సంబంధించిన 102 మంది సభ్యులు, మజ్లీస్ పార్టీకి 44 మంది, బీజేపీ నలుగురు సభ్యులు ఉన్నారు. ఎన్నికలు జరిగే 15 మంది సభ్యులకుగాను ప్రతి ఏడాది టీఆర్ఎస్ నుంచి 8, మజ్లీస్ నుంచి ఏడుగురు సభ్యులు పోటీలో ఉంటున్నారు. ఈసారి కూడా అదే తరహాలో ఉంటుందని అంచనా. ఇరు పార్టీలే పోటీలో ఉండడంతో ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అంశం తేదీలు
- ఎన్నికల నోటిఫికేషన్ మే 18
- నామినేషన్ల స్వీకరణ మే25నుంచి1జూన్వరకు(26సెలవు దినం తప్ప)
- నామినేషన్ల వేసేస్థలం అదనపుకమిషనర్(ఎన్నికలు), మూడో అంతస్తు
- నామినేషన్ల జాబితాప్రచురణ జూన్ 3
- స్క్రూట్నీ జూన్ 4, ఉదయం 11గంటల నుంచి 3గంటల వరకు
- అర్హత గల నామినేషన్ల జాబితా జూన్ 4
- నామినేషన్ల ఉపసంహరణ జూన్ 7, మధ్యాహ్నాం 3గంటలకు ముందు
- బరిలో ఉన్నవారి జాబితా జూన్ 7
- పోలింగ్ జూన్ 13, ఉదయం 10గంటలనుంచి 3గంటల వరకు
- లెక్కింపు, ఫలితాలు జూన్ 13, మధ్యాహ్నం 3గంటల తర్వాత