Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రికి పీఆర్టీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదోన్నతుల ప్రక్రియ తర్వాతే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి జి జగదీశ్రెడ్డిని శనివారం ఎమ్మెల్సీ కె జనార్దన్రెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు కలిసి వినతిపత్రం సమర్పించారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి రాష్ట్రంలో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలను టీఆర్టీకి ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులతో భర్తీ చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఆ తర్వాత టీఆర్టీ నియామకాలు చేపట్టాలని సూచించారు. ఇంకా ఖాళీలుంటే విద్యావాలంటీర్లను తీసుకోవాలని తెలిపారు. ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని కోరారు. జూన్ 1కి ముందే పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆంగ్ల మాధ్యమ అనుమతులకు సంబంధించి జాప్యాన్ని నివారించాలని కోరారు. పూర్తిస్థాయిలో అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలని సూచించారు.