Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బంగారు వ్యాపారం చేసే ముసద్దీలాల్ సంస్థలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన సమన్ల విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. నోట్ల రద్దు సమయంలో బంగారం విక్రయాల సమయంలో ఈడీ నాలుగేండ్ల కింద పెట్టిన కేసులో గతేడాది ఈడీ కేసుల ప్రత్యేక కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. అయితే ఆ దర్యాప్తు అయ్యాక ఇప్పుడు మళ్లీ ఈడీ సమన్లు జారీ చేయడం అన్యాయమని పేర్కొంటూ ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలెర్స్ డైరెక్టర్ నితీష్ గుప్తా, ముసద్దీలాల్ జ్యువెలర్స్ ఎండీ కైలాష్ చంద్, డైరెక్టర్ నిఖిల్ గుప్తాలు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ నెల 3న ఈడీ ఇచ్చిన సమన్లు కొట్టేయాలన్న వారి అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి తోసిపుచ్చారు. కేసును ఎదుర్కొంటున్న ముగ్గురూ ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే విచారణ సాయంత్రం ఐదు గంటల తర్వాత కొనసాగించరాదని ఈడీని ఆదేశించారు.