Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24,959 మంది అభ్యర్థుల దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ సోమవారం జరగనుంది. లాసెట్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లనూ పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాతపరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. బయోమెట్రిక్ ద్వారా హాజరు ఉన్నందున అభ్యర్థులు పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. లాసెట్ను 76 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఎల్ఎల్బీ (మూడేండ్లు)కి 17,498 మంది, ఎల్ఎల్బీ (ఐదేండ్లు)కి 5,181 మంది, ఎల్ఎల్ఎంకు 2,280 మంది చొప్పున మొత్తం 24,959 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.