Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-విలేకరుల యంత్రాంగం
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బోలేరో వాహనం బైక్ను ఢీ కొని ఇద్దరు, ట్రాక్టర్ బైక్ ఢీ కొని ఒకరు, కారు బోల్తా పడి ఒకరు మరణించారు. ఈ ఘటనలు సిద్ధిపేట, సంగారెడ్డి, నాగర్కర్నూలు జిల్లాల్లో ఆదివారం వేర్వేరుగా జరిగాయి.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి బంధువులతో కలిసి కొండపాక మండలం కుకునూరుపల్లి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి వచ్చారు. కుకునూరుపల్లిలోని ఓ మెడికల్ షాప్లో మందులు కొనుక్కోవడానికి వెంకటరెడ్డి(30) తన చెల్లెలు బొప్పాపూర్కు చెందిన కవిత(28), ఆమె కూతురు శ్రీవిద్య(7) బంధువుల అమ్మాయి శేరిపల్లి సౌమ్య(11)తో కలిసి బైక్పై వెళ్లాడు. మందులు తీసుకుని తిరిగి పోలీస్ స్టేషన్ దాటి జాతీయ రహదారిపై యూ టర్న్ తీసుకుంటుండగా సిద్దిపేట నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం అతివేగంగా వచ్చి బైక్ను ఢీ కొట్టింది. బైక్పై ఉన్న వెంకట్రెడ్డి, సౌమ్య అక్కడికక్కడే మృతి చెందారు. కవిత, శ్రీవిద్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి కమాన్ వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్, బైక్ ఢ కొన్నాయి. గాయాల పాలైన శేషగిరిబాబు(20) చికిత్స పొందుతూ ఆదివారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం తెరట్రాన్పల్లి స్టేజీ సమీపంలో కారు బోల్తాపడి ఒకరు మృతిచెందాడు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన దగ్గుల శ్రీనాథ్(30) మరో నలుగురితో కలిసి శ్రీశైలం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.