Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరిలోని పేదలు ఆది వారం ఆందోళనకు దిగారు. తిరుమలగిరి శివారులో 40కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటు న్నారు. ఆ స్థలంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని వారిని అక్కడి నుండి ఖాళీ చేయించారు. దీంతో వారంతా అక్కడి నుంచి జంగాలకాలనీకి వెళ్లి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. దీంతో వారంతా ఆ ఇండ్లు తమకు కేటాయించాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ మోహన్రావు, డీఎస్పీ నాగేశ్వరావులు అక్కడికి చేరుకొని వారితో మాటాడారు. వీలైనంత త్వరగా ఇండ్లు ఇచ్చే విధంగా చేస్తా మని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.