Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరీంనగర్ జిల్లా ఇందూర్తికి శాశ్వతంగా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు సోమవారం చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. ఇందూర్తి సీపీడబ్ల్యూఎస్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రేకొండ నుంచి వెళ్లే మిషన్ భగీరథ పైపు లేదా సుందరగిరి పైపులైన్ నుంచి అనుసంధానం చేసి నీటిని సరఫరా చేయాలని సూచించారు.