Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావు వాస్తవాలను కప్పిపుచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమ ర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగుందని, రాబడులు వస్తున్నాయని, కొద్దిపాటి బిల్లులు పెండింగ్లో ఉండడం సహజమని ప్రకటించడం అర్థసత్యమేనని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.3,400 కోట్ల కన్నా భారీగానే బి ల్లులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. చాలా బిల్లులు ట్రెజరీ వరకు రాకుండానే పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. బిల్లులు చెల్లిస్తే ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు ఎందుకు పనులు నిలిపివేస్తారని ప్రశ్నిం చారు. ఉపాధి హామీ చట్టం, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, కళ్యాణ లక్ష్మి వంటి వాటికి బకాయిలున్నాయని తెలిపారు. అప్పులు తేవడానికి అవకాశముందని ప్రకటించడమంటే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. రుణభారాన్ని 30 ఏండ్లకు పెంచడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు భారం మోయాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. బంగారు తెలంగాణ అంటూనే అప్పుల తెలంగాణ ఎలా మారుస్తున్నారని ప్రశించారు.