Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బడిబాటను మార్చాల్సిన అవసరముందని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) అధ్యక్షులు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి పగడాల లక్ష్మయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బడిబాట కోసం ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం షరామామూలుగా, మొక్కుబడిగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఒరిగేదేం లేదని తెలిపారు. బడిఈడు పిల్లలు ఇప్పటికే ప్రయివేటు పాఠశాలల్లో చేరిపోయారని పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరిలోనే కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సీట్లు అయిపోయాయని బోర్డులు పెట్టాయని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగినా, ఊరేగింపులు చేసినా ప్రయోజనం ఏంటని పేర్కొన్నారు.