Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) నాయకులు, కార్యకర్తలు 60 మందిని పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు టీఎస్యూటీఎఫ్ అధ్యక్షులు సిహెచ్ రాములు, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషిచేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడే ఆలోచనతో ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ రిజర్వాయర్ ప్రాంతాలు చూడడానికి వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడం సమంజసం కాదని తెలిపారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభద్రతలో ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకపోగా అరెస్టు చేయడం సరైంది కాదని తెలిపారు. పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని టీటీఎఫ్ అధ్యక్షులు ఈ రఘునందన్, ప్రధాన కార్యదర్శి కె రమణ ఓ ప్రకటనలో విమర్శించారు.