Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామారెడ్డి
రక్తదానం, రక్తనిధికి రక్తాన్ని ఇచ్చేందుకు దాతలను చైతన్య పరుస్తున్నందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ బెస్ట్ మోటివేటర్గా అవార్డు అందుకున్నారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 82 రక్తదాన శిబిరాలు నిర్వహించి 2460 యూనిట్ల రక్తాన్ని సేకరించేందుకు కలెక్టర్ సహకరించినట్టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి రాజన్న తెలిపారు. రక్తం సేకరణలో కామారెడ్డి జిల్లాను మొదటి స్థానంలో నిలిపారని చెప్పారు. ఐదు వేలకు పైగా కొత్త సభ్యులను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చేర్పించడంలో కలెక్టర్ క్రీయాశీల పాత్ర పోషించారని అన్నారు. కలెక్టర్ కూడా నాలుగు నెలలకు ఒకసారి రక్త దానం చేశారని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షునిగా ఎనలేని సేవలు అందించారన్నారు. రక్తదానం విషయంలో 'గీవ్ బ్లడ్-సేవ్ లైఫ్' నినాదంతో అందరికీ అవగాహన కల్పించారన్నారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన వీటి రాజ్కుమార్ కో బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు అందుకున్నారు.