Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారతదేశాన్ని అస్థిర పర్చాలని పాకిస్థాన్ కుట్రలు చేస్తున్నదని కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రడ్డి ఆరోపించారు. అవసరమైతే పాక్కు మరోమారు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సికింద్రాబాద్ పార్ల మెంటరీ నియోజకవర్గ పరిధిలో మంత్రి శనివారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు అనేక మంది బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
టీఆర్ఎస్ నేతల చూపు బీజేపీ వైపు : మురళీధర్రావు
టీఆర్ఎస్లో నియంతృత్వం పెరిగిపోయిందని, అక్కడ స్వేచ్ఛ లేకపోవడంతో ఆ పార్టీ ముఖ్య నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో బాలాజీనగర్కు చెందిన కార్పొరేటర్లు కావ్యారెడ్డి, హరీశ్చంద్రారెడ్డి దంపతులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు అమ్ముడుపోయారన్నారు. ఢిల్లీలో కింగ్ మేకర్ ఔదామన్నవారు నేడు జీరో అయ్యారన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్లో బీజేపీ పాగా వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.