Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘటన
- ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
హైదరాబాద్ పంజాగుట్టలో అనుమతి లేదని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి చెత్తడంప్లో వేసిన ఘటన మరువకముందే అంబేద్కర్కు మరో అవమానం జరిగింది. అనుమతి లేకుండా ప్రయివేటు వ్యక్తుల భూమిలో అంబేద్కర్, బుద్ధుడి విగ్రహాలను ఏర్పాటు చేశారని పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో శనివారం ఆలస్యంగా వెలుగు లోకొచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీ వీధినెంబర్2లో సర్వేనెంబర్ 13.40లో మేడి చెట్టు, రావిచెట్టు ఉంది. ఎనిమేదేండ్లుగా అక్కడే కొంతమంది అంబేద్కర్, బుద్ధుని ఫొటోలు పెట్టి కొంత కాలంగా పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాలనీవాసులు అందరూ కలిసి అంబేద్కర్, బుద్ధుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. దళితులు, బడుగు, బలహీ నవర్గాల వారు రోజురోజుకూ చైతన్యమ వుతున్నారని కొంతమంది అగ్రకులాలు కలిసి అను మతి లేకుండా విగ్రహాలు పెట్టారని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం ట్రాక్టర్ డోజర్ సాయంతో ఆ విగ్రహాలను తొలగించి పక్కనపెట్టారు. పూర్తిస్థాయిలో విచారించకుండా విగ్రహాలను ఎలా తీస్తారని అంబేద్కర్, దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తు న్నారు. ఇదే విషయమై మరో చర్చ జరుగుతోంది. కొద్ది రోజులకు ముందే బ్రాహ్మణులు కోర్టు నుంచి పొందిన ప్రాంతమని, స్థలాన్ని కబ్జా చేయడానికే దళిత సంఘాల నాయకులు రాత్రికి రాత్రే విగ్రహాలను ప్రతిష్టించారని పలువురు ఆరోపిస్తు న్నారు. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినప్పటికీ విచారణ చేప డుతున్నామని పోలీసులు చెప్పారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులపై దళిత సంఘాల నాయకులు కలెక్టర్కు వినతిపత్రమిచ్చారు.